పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల కొనుగోలు ?
న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో భారత ఆర్మీకి కేంద్రం విశేష అధికారాలు కల్పించింది. శత్రుదేశంతో పోరాడేందుకు కావాల్సిన ఆధునాతన సాంకేతిక పరిజానం గల ఆయుధాలు కొనుగోలు చేసందుకు అత్యవసర అధికారాలను కేటాయించినట్టు తెలిసింది.
ఆధునాతన క్షిపణులు
వాయు, నౌక, ఆర్మీ .. త్రివిధ దళాలు తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. రూ.300 కోట్లతో ఆయుధ పరికరాను ఆర్మీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులో 246 స్పైక్ యాంటి ట్యాంకు క్షిపణిలు ఉన్నాయి. వీటితో శత్రుదేశాల్లో గల లక్ష్యాలను సులభంగా ధ్వంస చేసే వీలుంటుంది.

ముందుస్తు వ్యుహం ?
ఆర్మీతోపాటు నౌకా, వాయుసేన కూడా క్షిపణులు కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. తమకు కావాలసిన పరికరాల కొనుగోలు కోసం మూడునెలల ముందే ప్రతిపాదన తయారీచేసినట్టు సమాచారం. నౌకా, వాయుసేన విభాగాలు .. ఆధునాతన క్షిపణుల కొనుగోలు కోసం భాగస్వామ్య దేశాలను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications