చిచ్చు పెట్టిన సింగం: బీజేపీకి గుడ్బై: ఎన్డీఏ నుంచి బయటికి..!!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోొటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ వచ్చిన ఏఐఏడీఎంకే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కూటమికి గుడ్బై చెప్పింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది.
ఈ మేరకు చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు వారంతా.

బీజేపీ- ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలంటూ ఏఐఏడీఎంకే నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై చేసిన వ్యాఖ్యలు- ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్ చేసినప్పటికీ.. ఆయన పట్టించుకోలేదు. దీనితో ఈ నిర్ణయం తీసుకుంది అన్నా డీఎంకే.
తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి, ద్రవిడ ఐకాన్ సీఎన్ అన్నాదురై.. హిందూమతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు అన్నామలై. 1956లో మధురైలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం అన్నాదురై మధురైలో ఆశ్రయం పొందారని, క్షమాపణలు సైతం చెప్పారని అన్నామలై ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకే కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అన్నాదురైను అవమానించాడని, దీనిపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయినప్పటికీ- అన్నామలై పట్టించుకోలేదు.
దీనితో బీజేపీ- ఎన్డీఏ నుంచి బయటికి రావాలని ఏఐఏడీఎంకే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ఆమోదం పొందగానే ఏఐఏడీఎంకే కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
#WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj
— ANI (@ANI) September 25, 2023
తమిళనాడు అసెంబ్లీతో పాటు 2019 లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే- బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఈ మిత్రపక్షాలకు చుక్కెదురైంది. డీఎంకే- కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే తరహా ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉండగా.. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకే ఒక్కటి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications