Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AIMIM పొత్తు పార్టీపై రూ. 1,000 కోట్ల స్టింగ్ ఆపరేషన్: ఒవైసీ కటీఫ్

అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లీమీన్ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఓ స్టింగ్ ఆపరేషన్ దీనికి కేంద్ర బిందువు అయింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేయడానికి బీజేపీ నుంచి 1,000 కోట్ల రూపాయల మొత్తాన్ని తీసుకుందనే ఆరోపణలు ఎంఐఎంను చుట్టుముట్టాయి.. ఈ స్టింగ్ ఆపరేషన్ తో.

తృణమూల్ కాంగ్రెస్ కు పడాల్సిన మైనారిటీ ఓట్లను చీల్చడానికి, బీజేపీ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందడానికి ఎంఐఎం ప్రణాళికలు రూపొందించుకుందనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను తృణమూల్ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. రూ. 200 కోట్ల అడ్వాన్స్ చెల్లింపుతో సహా ఎంత మొత్తంలో నిధులను మజ్లిస్ తీసుకుంటుందనే ప్రస్తావన కూడా ఇందులో రికార్డయింది.

AIMIM Withdraws Alliance with AJUP After Sting Operation Video Controversy and Muslim Claims

ఈ పరిణామాల నేపథ్యంలో కబీర్ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP)తో తన పొత్తును ఉపసంహరించుకుంది ఎంఐఎం. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఈ స్టింగ్ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంఐఎం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, బీజేపీతో తనకున్న సంబంధాలను ఏజేయూపీ నేత హుమయూన్ కబీర్ వెల్లడించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హుమయూన్ కబీర్ గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో పని చేశారు. అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. అనంతరం ఏజేయూపీ పేరుతో ప్రత్యేకంగా పార్టీ పెట్టారు కబీర్. మైనారిటీ ఓటుబ్యాంక్ బలంగా ఉండే కొన్ని నియోజకవర్గాలపై ఆయనకు పట్టు ఉందని భావిస్తోన్నారు. దీంతో ఏఐఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. రాబోయే ఎన్నికలలో తమ పార్టీని ఓడించే లక్ష్యంతో బీజేపీ కుట్ర పన్నిందని, ఇందులో ఏఐఎంఐఎం, ఏజేయూపీలను ఎరగా వేసిందంటూ తృణమూల్ ఆరోపణలు చేయడం, దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేయడంతో పరిణామాలు మారిపోయాయి. పొత్తు నుంచి బయటికి వచ్చింది.

ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే కబీర్ వీడియో బయటకు వచ్చిందనేది తృణమూల్ వాదన. ప్రధానమంత్రి కార్యాలయంతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకోవాలని తనకు సలహా అందినట్లు హుమయూన్ కబీర్ ఈ వీడియోలో చెప్పడం స్పష్టంగా వినొచ్చు. బెంగాల్ లో ముస్లింలను మోసం చేయడం సులభం అని కూడా కబీర్ చెప్పడం ఇందులో రికార్డయింది.

ఈ వీడియో వెలుగులోకి వచ్చాక ఎంఐఎం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హుమయూన్ కబీర్ పార్టీతో తమ పొత్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ముస్లింల సమగ్రతను ప్రశ్నించే నాయకులతో పొత్తు పెట్టుకోలేమని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తామని, భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది.

టీఎంసీ ఆరోపణలను కబీర్ తోసిపుచ్చారు. ఈ వీడియోను ఏఐ జనరేటెడ్ గా అభివర్ణించారు. 2019 నవంబర్ నుండి ఏ బీజేపీ నాయకుడితోనూ సంబంధం పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఈ ఫేక్ స్టింగ్ ఆపరేషన్ వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీం ఉన్నారని కబీర్ ఆరోపించారు. రాజకీయంగా తనతో పోరాడలేరని, అందుకే అణగదొక్కడానికి ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+