విమాన టిక్కెట్టు ధర రూ.407, భారీ ఆపర్లతో ప్రయాణీకులకు వల
విమాన ప్రయాణ చార్జీలుభారీగా తగ్గాయి. అత్యల్ప ధరల్ని ఎయిర్ ఏషియా సంస్థ ప్రకటించింది. ప్రచారపథకాల్లో భాగంగా ఆ సంస్థ రూ.407 రూపాయాలకే విమాన టిక్కెట్టు ధరను ప్రకటించింది.
న్యూఢిల్లీ :ఇక బస్సుల్లో ప్రయాణం చేసినట్టుగానే విమానాల్లో కూడ ప్రయాణం చేసే వీలు దక్కింది.విమానంలో ప్రయాణించే అత్యల్ప ధరల్ని ప్రకటించింది.2017 ఎర్లీ బర్డ్ సేల్ అనే ప్రచారంలో భాగంగా విమాన టిక్కెట్టు ధరలను తగ్గించారు.
ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 22వ, తేది వరకే ముగియనుంది.ఈ ఆఫర్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొన్న టిక్కెట్ల ద్వారా 2017 మే నుండి 2018 ఫిబ్రవరి మద్య ప్రయాణం చేసే అవకాశం ఉంది.
గౌహతి నుండి ఇంఫాల్ కు రూ.407,గోవా నుండి హైద్రాబాద్ కు రూ.877, హైద్రాబాద్ నుండి బెంగుళూరుకు రూ.988 , జైపూర్ నుండి పూణేకు రూ.2,516 ,పూణె నుండి బెంగుళూరుకు రూ.821 , బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు రూ.663 రూపాయాలను ఆఫర్ లో ప్రకటించింది.ఈ మార్గాలతో పాటు ఇతర మార్గాలకు కూడ ఈ ఆఫర్ ను వర్తింపజేయనుంది.

ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించాయి.దీంతో ఎయిర్ ఏషియా కూడ తాజా ఆఫర్ ను ప్రకటించింది. దేశీయ మార్కెట్లో విమానాయన ప్రయాణంలో డిమాండ్ ను క్యాష్ చేసుకొనేందుకుగా ఈ ఆఫర్ ఉపయోగపడుతోందని ఆ సంస్థ భావిస్తోంది.
జెట్ ఎయిర్ వేస్ , ఎయిర్ భారతదేశం, గో ఎయిర్ స్పైజెట్ ఇండిగో , నూతన సంవత్సర డిస్కౌంట్లను ప్రకటించడంతో పాటు భారీ విస్తరణకు దిగుతున్నారు. అసోచామ్ ఐఎటిఎ ప్రకారంగా 2016 నవంబర్ లో దేశీయ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ 22.3 శాతం వృద్దిని నమోదుచేసుకొంది.












Click it and Unblock the Notifications