గాల్లో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు !
ముంబై: ముంబై నుంచి అమెరికా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలోని కార్గో విభాగంలో మంటలు వ్యాపించినట్లు అలారం రావడంతో దాన్ని దారిమళ్లించారు. కజకిస్థాన్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఈ విమానంలో ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని, విమానాన్ని ఇంజనీర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విమానంలో ఇప్పటి వరకు మంటలు కాని, పొగ కాని కనిపించలేదని అధికారులు అన్నారు.

గురువారం వేకువ జామున 2.25 గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం టేకాఫ్ అయ్యింది. అమెరికాలోని నెవార్క్ కు బయలుదేరిన ఈ విమానాన్ని గురువారం ఉదయం 8 గంటలకు కజకిస్థాన్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
కార్గో విభాగంలో ఉండే కొన్ని వస్తువుల కారణంగా అలారం వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. సాంకేతిక పరంగా కొన్ని అనుమతులు వచ్చిన తరువాత విమానాన్ని నెవార్క్ కు పంపాలా ? వద్దా ? అని నిర్ణయిస్తామని అన్నారు.
అత్యవసరం అయితే ప్రయాణికులను తరలించడానికి ఢిల్లీ విమానాశ్రయంలో మరో విమానం సిద్దంగా ఉందని, ఆపరేషనల్ కారణాల వలనే బోయింగ్ 777 విమానాన్ని దారి మళ్లించామని ఎయిర్ ఇండియా ఓ ట్వీట్ లో పేర్కొంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications