దుబాయ్ నుంచి కొచ్చికి ఎయిర్ ఇండియా డైలీ ప్లైట్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి కేరళ రాజధాని కొచ్చికి ప్రతి రోజూ విమాన సర్వీసుని నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దుబాయ్లో నివసిస్తున్న భారతీయులు కోరిక మేరకు జనవరి 11 నుంచి డైలీ విమానాన్ని నడపడానికి నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా గల్ఫ్- రీజియన్ మేనేజర్ మెల్విన్ డిసిల్వా వెల్లడించారు.
షార్జా-కొచ్చి-షార్జా సర్వీసుకు 180 సీట్లు ఉన్న ఏ320 ఎయిర్ క్రాప్ట్ను ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎయిర్ఇండియా ప్రమోషనల్ ఆఫర్స్ ఇస్తోంది. ఎయిర్ ఇండియా ప్రతి వారం అబుదాబి, దుబాయి, షార్జా అంతర్జాతీయ విమానాశ్రయాలకు 74 విమానాలను నడుపుతోంది.
దుబాయ్ నుంచి 1330 గంటలకు బయల్దేరిన AI-934 విమానం కొచ్చి విమానాశ్రయానికి 1910 (స్ధానిక కాలమానం ప్రకారం)కు చేరుకుంటుంది. అదే విధంగా AI-933 విమానం కొచ్చి విమానాశ్రయం నుంచి 0935 గంటలకు బయల్దేరి దుబాయ్ విమానాశ్రయానికి 1235కు చేరుకుంటుంది.
ఈ సర్వీసులో వన్వేకు 330 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్లు (సుమారు రూ.6వేలు), వెళ్లి రావడానికి 785 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్లు (సుమారు రూ.14,268)గా నిర్ణయించింది. అదే విధంగా 30 కేజీల ఉచిత లగేజీ అలవెన్స్ను ఎయిర్ ఇండియా ఇస్తోంది.