ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్, అత్తగారి ఇంట్లోకి.....
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్దకోడలైన ఐశ్వర్యరాయ్ను ఎట్టకేలకు ఇంట్లోకి అనుమతించారు. గత మూడు నెలలుగా ఆమే ఇంటిలోని అవుట్ హౌజ్లోనే ఉంచుతూ ఇంట్లోకి రానీయకుండా కనీసం అన్నం కూడ పెట్టలేదని ఐశ్వర్యరాయ్ మీడియాకు వివరించిన నేపథ్యంలోనే ఐశ్వర్య అత్త రబ్రీదేవి దిగివచ్చారు. పోలీసుల జోక్యంతో సోమవారం మధ్యహ్నాం అనేక నాటకీయ పరిణామాల మధ్య తన కోడలిని ఇంట్లోకి అనుమతించారు.
ఆర్జేడి అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్ద కోడలు వివాదం గత ఆరునెలలుగా కొనసాగుతోంది. పెళ్లైన కొద్ది రోజులకే విడాకులకు అప్లై చేశారు. దీంతో విడాకుల కేసుపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలనే లాలు ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ భార్య అయిన ఐశ్వర్య యాదవ్ అత్త మరియు ఆడబిడ్డపై అనేక అరోపణలు చేసింది. రాజ్యసభ సభ్యురాలైన మీసాభారతి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అరోపణలు చేసింది. ఆమే సమక్షమంలోనే శనివారం రాత్రీ కూడ తనతో దారుణంగా వ్యవహరించారని తెలిపింది. భార్యభర్తల మధ్య ఘర్షణకు ప్రధాన ఆమే కారణమని ఆరోపణలు చేసింది.

దీంతోపాటు ఐశ్వర్య తల్లిదండ్రులైన మాజీ మంత్రి ,ఆర్జేడీ సీనియర్ నాయకుడు చంద్రిక రాయ్,మరియు పూర్ణిమ రాయ్తో కలిసి ఆమే అత్తింటి ముందు భైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఇంటి లోపలికి రానివ్వాలంటూ రబ్రీదేవిపై ఒత్తిడి తెచ్చారు. వీరితో పాటు మరికొంతమంది ఇతర పార్టీల నేతలు సైతం ఈ ఆందోళన పాల్గోన్నారు. దీంతో రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ఆయన రబ్రీదేవితోపాటు ఆమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య రాయ్ సోమవారం మధ్యహ్నం అత్తవారింట్లోకి అడుగు పెట్టింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications