అఖిలేష్, పూనమ్ సిన్హా నామినేషన్ పత్రాలు దాఖలు: రాజ్ నాథ్ సింగ్ పై షాట్ గన్ భార్య పోటీ!
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన మధ్యాహ్నం ఆయన మిత్రపక్షం బహుజన్ సమాజ్ వాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాతో కలిసి ఆజంగఢ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సారి కుమారస్వామి వంతు! హెలికాప్టర్ లో తనిఖీలు..లగేజీనీ వదల్లేదు!
రిటర్నింగ్ అధికారికగా వ్యవహరిస్తోన్న జిల్లా కలెెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆజంగఢ్ లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఆజంగఢ్ సమాజ్ వాది పార్టీకి కంచుకోట. ఇదివరకు అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. కుమారుడి కోసం ఆయన తన స్థానాన్ని త్యాగం చేశారు. మైన్ పురి నుంచి ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇటీవలే సమాజ్ వాది పార్టీ తీర్థం పుచ్చుకున్న పూనమ్ సిన్హా ఇవ్వాళే నామినేషన్లను దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె భర్త, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉన్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజకీయాల్లో అరంగేట్రం చేసిన పూనమ్ సిన్హా.. తన తొలి పోటీలోనే గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆమె ఢీ కొట్టబోతున్నారు.
బీజేపీ అభ్యర్థిగా రాజ్ నాథ్ సింగ్ ఈ సారి కూడా లక్నో నుంచే పోటీ చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎస్పీ-బీఎస్పీ కార్యకర్తలు, నాయకుల మద్దతుతో తాను రాజ్ నాథ్ సింగ్ ఓడించగలుగుతానని పూనమ్ సిన్హా ధీమా వ్యక్తం చేస్తున్నారు.