అఖిలేష్ చదువుకున్న మూర్ఖుడు : ఉమా భారతి ఫైర్
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలేష్ తీసుకున్న నిర్ణయాలను ప్రజా వ్యతిరేకమైన చర్యగా తప్పుబట్టిన ఆమె అఖిలేష్ ఓ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని, సీఎం అయినంత మాత్రాన అంత అహంకారం పనిచేయదని మండిపడ్డారు.
ఉమాభారతికి అంతలా ఆగ్రహం తెప్పించిన విషయమేంటంటే..! దేశంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు కేంద్రం రైళ్ళ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుందేల్ ఖడ్ లో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం రైలు ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే యూపీ మీదుగా నీటిని తీసుకుని వెళ్తున్న రైలును గురువారం ఝాన్సీలో స్టేషన్ లో నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు సీఎం అఖిలేష్.

అంతేకాదు, కేంద్రానికి ఈ విషయంలో జోక్యం అనవసరమంటూ కేంద్రానికి మంట పుట్టించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అఖిలేష్ చర్యపై స్పందించిన ఉమా భారతి అఖిలేష్ ను ఓ చదువుకున్న మూర్ఖుడిగా అభివర్ణించారు. ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, ఆహారం వంటి వాటిపై కూడా రాజకీయం చేయాలని చూడడం సరికాదని, ఆ అవసరం తమకు లేదని తెలిపారు. ఏదేమైనా రాజకీయాల కోసం ప్రజలను బలి పశువులను చేయడం సరైంది కాదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications