పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర...భద్రతా వ్యవహారాల ఇంచార్జ్గా కిషన్ రెడ్డి..
జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి యాత్రికుల బృందం అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షన్నర మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. నేడు ప్రారంభమైన యాత్రలో భాగంగా బల్తాల్ బేస్ క్యాంప్ నుండి 1617 మంది బయలుదేరగా అందులో 1174మంది పురుషులు, 379 మహిళలు ,15 పిల్లలు,కాగా 49 మంది మత పెద్దలు ఉన్నారు..కాగా పహెలాగాం నుండి మరో 2800 మంది యాత్రికులు బయలు దేరారు.
కాగా నేడు ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. అమర్నాథ్ యాత్రకు ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించింది.భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇంఛార్జిగా వ్యవహరించనున్నారు. ఇక భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితమ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.













Click it and Unblock the Notifications