రాహుల్ క్షమాపణ చెప్పాలి, ఆధారాలుంటే వాటిని కోర్టుకు తీసుకెళ్లలేదేం: అమిత్ షా డిమాండ్
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందం విషయంలో దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. రాఫెల్ డీల్ పైన చేసిన ఆరోపణలకు రాహుల్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. రాఫెల్ డీల్ విషయంలో ఒక అబద్దాన్ని పదేపదే ప్రచారం చేశారని మండిపడ్డారు. రాఫెల్ పైన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టించిందని చెప్పారు. అబద్దాలు ప్రచారం చేసిన వారికి సుప్రీం కోర్టు తీర్పు చెంప దెబ్బ అన్నారు. రాఫెల్ విమానాల వల్ల దేశానికి మేలు జరిగిందని చెప్పారు.

సుప్రీం కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. నిజం ఎప్పటికీ గెలుస్తుందని చెప్పారు. దేశంలోని అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించిందన్నారు. అబద్దాలు ప్రచారం చేసే అలాంటి వారికి సుప్రీం కోర్టు తీర్పు దెబ్బ అన్నారు. అసలు అలాంటి ఆరోపణలు చేయడానికి అతని వద్ద ఉన్న ఆధారాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు.
ఆకాశం పైన ఎంత మట్టి వేసినా, ఉమ్మేసినా అది తిరిగి మన మీదే పడుతుందని చెప్పారు. అసలు కాంగ్రెస్ వద్ద అన్ని ఆధారాలు ఉంటే సుప్రీం కోర్టుకు వాటిని పట్టుకొని ఎందుకు వెళ్లలేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీ జేపీసీ కోసం డిమాండ్ చేస్తోందని, దానికి తాము సిద్ధమని చెప్పారు. కానీ చర్చ జరిగేందుకు విపక్షాలు ఆస్కారం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications