Stan Swamy : స్టాన్ స్వామి కేసులో షాకింగ్-కంప్యూటర్ హ్యాక్-ఆధారాలు చొప్పించి-యూఎస్ రిపోర్ట్
రెండేళ్ల క్రితం మావోయిస్టులతో కలిసి ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ బీమా కొరెగావ్ కేసులో అరెస్టు చేసిన ఫాదర్ స్టాన్ స్వామి ఆ తర్వాత కస్టడీలోనే చనిపోయారు. ఈ వ్యవహారంపై యూఎస్, యూకే వంటి దేశాలు స్పందించాయి. దీంతో భారత్ ఇరుకునపడాల్సిన పరిస్దితి. ఇప్పుడు ఈ కేసులో యూఎస్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ సంస్ధ కీలక ఆధారాలు బయటపెట్టింది.
మావోయిస్టులతో లింకుల ఆరోపణలతో ఎన్ఐఏ అభియోగాలు మోపి అరెస్టు చేసిన 83 ఏళ్ల స్టాన్ స్వామి ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో ఇందుకు సంబంధించిన ఆధారాలను అమర్చారని ఫోరెన్సిక్ సంస్ధ ఆర్సెనిక్ కన్సల్టింగ్ గుర్తించింది. స్వామి తరపు న్యాయవాదులు నియమించిన బోస్టన్కు చెందిన ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ తన అధ్యయనంలో మావోయిస్టు లేఖలు అని చెప్పిన 44 పత్రాల్ని గుర్తుతెలియని వ్యక్తి సైబర్ దాడి చేసి స్వామి కంప్యూటర్లోకి ప్రవేశించి చాలా కాలం పాటు పెట్టాడని వెల్లడించిది. 2014 నుండి ప్రారంభించి 2019లో సైబర్ దాడికి గురయ్యే వరకు ఇలా పలు డాక్యుమెంట్లు ఆయన ల్యాప్ టాప్ లో పెట్టారని గుర్తించారు.ఈ కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ కూడా నివేదించింది.

గిరిజనుల మధ్య పనిచేసిన జార్ఖండ్కు చెందిన జెస్యూట్ పూజారి స్టాన్ స్వామిని భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోవిడ్-సంబంధిత సమస్యల కారణంగా ఆయన జైలులో ఉన్న ఏడాదిలోపే చనిపోవడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఫాదర్ స్టాన్ స్వామి మరణ వార్తపై ఐరాసతో పాటు ఈయూ కూడా తీవ్రంగా స్పందించాయి. ఉగ్రవాది అంటూ తప్పుడు ఆరోపణలతో ఆయన్ను జైల్లో ఉంచి చావుకు కారణమయ్యారంటూ వారు ఆరోపించారు. అయితే 2018లో మహారాష్ట్రలోని భీమా-కోరెగావ్ గ్రామంలో దళితులు అగ్రవర్ణ సైన్యాన్ని ఓడించిన చారిత్రాత్మక పోరును గుర్తుచేసుకోవడానికి దళితులు గుమిగూడి అల్లర్లను ప్రేరేపించడానికి మరో 15 మందితో కలిసి కుట్ర పన్నారని ఎన్ఐఏ పేర్కొంది. వారి కంప్యూటర్ల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ప్రధాని మోడీని చంపడానికి మావోయిస్టులతో కలిసి కుట్ర పన్నారని స్వామితో పాటు పలువురిపై అభియోగాలు మోపారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications