Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీ బిల్లు: రాజ్యసభలో ప్రతిపాదనకు అన్సారీ అభ్యంతరం

Hamid Ansari
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు మంగళవారం రాజ్యసభకు రావడం లేదు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ తెలంగాణ బిల్లును ముందుగా రాజ్యసభలో చేపట్టడంపై అభ్యంతరాలు లేవనెత్తారు. హమీద్ అన్సారీ అనుమానాల నివృత్తి కోసం తెలలంగాణ బిల్లును న్యాయ శాఖ సలహా కోసం పంపుతున్నారు. న్యాయశాఖ ఇచ్చే సలహామేరకు బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టాలా? లేక లోక్‌సభలో ప్రతిపాదించాలా? అన్న విషయాన్ని నిర్థారిస్తారు.

తెలంగాణ బిల్లు ఆర్థికాంశాలతో కూడిన కేటగిరి-ఎ బిల్లు అని న్యాయశాఖ నిర్థారిస్తే లోక్‌సభలో ప్రతిపాదించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఆర్థికాంశాలతో కూడిన కేటగిరీ-బి బిల్లుగా న్యాయశాఖ సూచిస్తే దీన్ని రాజ్యసభలో ప్రవేశ పెట్టేందుకు వీలుంటుంది. కేంద్ర న్యాయశాఖ తన సలహాను మంగళవారం సాయంత్రంలోగా అందజేయనున్నది కాబట్టి తెలంగాణ బిల్లు బుధవారం మాత్రమే పార్లమెంట్ పరిశీలనకు వస్తుంది.

నిజానికి, బిల్లును మంగళవారమే రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అందుకోసం హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, పంచాయితీ రాజ్ మంత్రి జైరామ్ రమేష్ రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీని కలిసి తెలంగాణ బిల్లును ప్రతిపాదించటంపై చర్చలు జరిపారు. బిల్లును ముందుగా లోక్‌సభలో కాకుండా రాజ్యసభలో ప్రతిపాదించాలన్న నిర్ణయంపై సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిజెపి కూడా సన్నద్ధమైంది.

సోమవారమే బిల్లును ప్రతిపాదించాలని అనుకున్నా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కొన్ని వివరణలు కోరటంతో తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించటం సాధ్యం కాలేదు. ప్రణబ్ ముఖర్జీ మూడు అంశాలపై వివరణ కోరుతూ తెలంగాణ బిల్లును కేంద్రానికి తిప్పిపంపారు. కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం మూడు అంశాలపై వివరణను రాష్టప్రతికి పంపింది. ప్రభుత్వం పంపిన మూడు వివరణలను రాష్టప్రతి పరిశీలించిన అనంతరం తెలంగాణ బిల్లుపై సంతకం చేసి సోమవారం మధ్యాహ్నం హోంశాఖకు పంపారు. రాజ్యసభ అప్పటికే మంగళవారానికి వాయిదాపడటంతో, తెలంగాణ బిల్లును సోమవారం ప్రతిపాదించటం సాధ్యం కాలేదు.

ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే హోంమంత్రి సుశీల్‌కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, జీవోఎం సభ్యుడు, పంచాయితీరాజ్ మంత్రి జైరామ్ రమేష్‌లు రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీని ఆయన చాంబర్‌లో కలిశారు. తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించటంపై చర్చలు జరిపారు. అయితే, తెలంగాణ బిల్లును రాజ్యసభలోనే ఎందుకు ప్రతిపాదించాలని అనుకుంటున్నారని అన్సారీ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌కు లేఖ రాశారు. ఈ స్థితిలో కేంద్ర మంత్రులు అన్సారీతో చర్చలు జరిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+