Article 370: జమ్మూకశ్మీర్లో 80ల నుంచి హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు ! తీర్పులో జడ్డి సూచన..
ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిన్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని తెలిపింది. 1957లోనే రాజ్యాంగ పరిషత్ రద్దయినా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చెల్లుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదే సమయంలో ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. మరో కీలక ఆదేశం కూడా ఇచ్చారు.
ఆర్టికల్ 370పై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తన అభిప్రాయం రాసిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. జమ్మూ కాశ్మీర్ లో హక్కుల దుర్వినియోగంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కీలక సూచన చేశారు. రాష్ట్రంలో సైన్యం ప్రవేశంతో ప్రజలు కొన్ని దశాబ్దాలుగా భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయ లోని కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన జస్టిస్ కౌల్.. తాను ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో ఈ సూచన చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. కనీసం 1980ల నుండి రాష్ట్ర, రాష్ట్రేతర మానవ హక్కుల ఉల్లంఘనలను విచారించడానికి, నివేదించడానికి నిష్పాక్షికమైన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసారు. అలాగే లోయలో వర్గాల మధ్య సయోధ్య కోసం చర్యలను సిఫార్సు చేస్తున్నానన్నారు. మరోవైపు తన పదవీ విరమణకు కేవలం 15 రోజుల ముందు జస్టిస్ కౌల్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
సైన్యాలు శత్రువులపై పోరాడేందుకు ఉంటాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను నియంత్రించడానికి కాదని కౌల్ వ్యాఖ్యానించారు. సైన్యం ప్రవేశం రాష్ట్రంలో దాని స్వంత గ్రౌండ్ రియాలిటీని సృష్టించిందని, పురుషులు, మహిళలు, పిల్లలు దీంతో భారీ మూల్యం చెల్లించుకున్నారు అని జస్టిస్ కౌల్ అన్నారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications