భారత్.. మరో సిరియా అవుతుందన్న శ్రీశ్రీ రవిశంకర్ కు కమిటీలో స్థానం కల్పించడమా?: ఒవైసీ
హైదరాబాద్: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలే దీనికి కారణం.
మధ్యవర్తిత్వ కమిటీలో శ్రీ శ్రీ రవిశంకర్ ను నియమించడం సహేతుకం కాదని హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన స్థానంలో తటస్థుడిని నియమించాలని అన్నారు. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంలో శ్రీశ్రీ రవిశంకర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మొత్తాన్నీ హిందువులకు అప్పగించకపోతే.. భారత్ మరో సిరియాలా మారుతుందని శ్రీశ్రీ రవిశంకర్ హెచ్చరించారు.

రెండేళ్ల కిందట ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని మధ్యవర్తిత్వ కమిటీలో నియమించడాన్ని ఒవైసీ తప్పుపట్టారు. రవిశంకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవచ్చని అన్నారు. ఆయన ఆలోచన విధానం మిగిలిన సభ్యులపై పడుతుందని చెప్పారు. రవిశంకర్ ను తప్పించి, ఆయన స్థానంలో మరో తటస్థుడిని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ మధ్యవర్తిత్వ కమిటీలో రవిశంకర్ తో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా, న్యాయవాది శ్రీరామ్ పంచు ఉన్నారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ కేంద్రంగా ఈ కమిటీ పనిచేస్తుంది. హిందు, ముస్లిం ప్రతినిధులు, సంఘాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. అనంతరం ఓ నివేదికను రూపొందించి, సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. మొత్తం ఎనిమిది వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications