Ayodhya ram mandir: తిరుమలలో వేదవిద్యార్థుల రామాయణ పారాయణం; నగర సంకీర్తనలతో భక్తిపారవశ్యం!!
అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రాణ ప్రతిష్ట అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ మేరకు ప్రముఖులందరూ అయోధ్య నగరానికి చేరుకుని ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొంటున్నారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీరాముడు అయోధ్య నగరానికి వేం చేసిన శుభ తరుణంలో జరగనున్న అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తోంది.
ఇక అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా సంపూర్ణ రామాయణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయోధ్యలో నేడు రామాలయంలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వేద విద్యార్థులతో రామాయణ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీటీడీ తెలిపింది.

ప్రస్తుతం రామాయణ పారాయణతో తిరుమల గిరులు మారుమోగి పోతున్నాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని, అయోధ్యలో కొనసాగుతున్న హడావిడిని టిటిడి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఎస్విబిసి తెలుగు ఛానల్లో స్వామివారి కల్యాణోత్సవం అనంతరం 12 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తి కావడంతో తిరుపతిలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. నగరంలోని కోలా వీధిలో ఉన్న శ్రీరాముని ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు సుదర్శన హోమం లో పాల్గొన్నారు. 500 ఏళ్ళనాటి కల నిజమైందని.. శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తిరుపతి వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పండుగ వాతావరణంలో పూర్తి కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో 500 మంది కళాకారులు ర్యాలీ నిర్వహించారు. టీటీడీ పరిపాలన భవనం నుంచి అన్నమాచార్య కళామందిరం వరకు జరిగిన ప్రదర్సనలో జైశ్రీరామ్ అంటూ భజన బృందాలు నామస్మరణలు చేశారు.
శ్రీరాముని విగ్రహాలతో భజన బృందాలు ప్రదర్సన నిర్వహించాయి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరగడం ఎంతో గర్వంగా ఉందని.. కోట్లాదిమంది హిందువులకు ఈరోజు పెద్ద పండుగని భజన బృందాలు పేర్కొన్నాయి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీరాముని సంకీర్తనలను నిరంతరాయంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications