అసోంలో దెబ్బ.. హిమంత విశ్వశర్మపై ఈసీ వేటు, ప్రచారం నిషేధం
అసోంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత, స్టార్ క్యాంపెయినర్ హిమంత విశ్వ శర్మపై ఎన్నికల సంఘం రెండురోజులపాటు వేటు వేసింది. ప్రచారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది. శుక్రవారం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానన్నాయని స్పష్టం చేసింది. హిమంత విశ్వ శర్మ ఇటీవల జరిగిన ఓ సభలో బోడోలాండ్ నేత హంగ్రామా మొహిలరీకి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

కోక్రాజర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసుని ఎన్ఐఏకి అప్పగించామని తెలిపారు. హంగ్రామా సహా బోడోలాండ్ ప్రాంతంలో ఎవరూ అలజడులు సృష్టించడం సహించబోమని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత శర్మపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొహిలరీని జైలుకు పంపుతామని బహిరంగంగా బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దీనికి సంబంధించి హిమంత ఇచ్చిన సమాధానంతో ఈసీ సంతృప్తి చెందలేదు. దీంతో రెండు రోజుల నిషేధం విధించాలని నిర్ణయించింది. 126 స్థానాలు ఉన్న అసోంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత పోలింగ్ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడతాయి.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications