పుట్ బాల్ వరల్డ్ కప్ మహత్యం: పిజ్జాలు బీర్లు తెగ అమ్ముడుపోతున్నాయట
ఐపీఎల్, ఫుట్ బాల్ వరల్డ్ కప్ పుణ్యమా అంటూ భారత్లో పిజ్జా బీర్ సేల్స్ ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్లో ఐపీఎల్ మ్యాచులతో ప్రారంభమైన పిజ్జా బీర్ల సేల్... తాజాగా జరుగుతున్న పుట్ బాల్ ప్రపంచ కప్ వరకు జోరుగా సాగుతున్నాయి. 2018 ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారనే విషయం పక్కనబెడితే... డోమినోస్ పిజ్జా, బీర్ల కంపెనీ కింగ్ ఫిషర్లు తెగ లాభాలు చూస్తున్నాయట.
ఈ ఏడాది ఏప్రిల్ వరకు అంటే ఐపీఎల్ ప్రారంభం అయ్యేవరకు సేల్స 19శాతంగా ఉండగా ఐపీఎల్ స్టార్ట్ అవగానే ఒక్కసారిగా మూడురెట్లు సేల్స్ శాతం పెరిగిందని అధికార గణాంకాలు తెలిపాయి. ప్రస్తుతం ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుండటంతో పిజ్జా, బీర్లను చాలామంది ఆశ్రయిస్తున్నారని పీఆర్బీ సెక్యూరిటీస్ డైరెక్టర్ రాజేంద్ర వాధేర్ చెబుతున్నారు. ఫుట్ బాల్ మ్యాచులు జరిగే సమయంలో రెస్టారెంట్లు యువతతో నిండిపోతున్నాయని అదే సమయంలో పిజ్జా బీర్లు కూడా విపరీత స్థాయిలో అమ్ముడుపోతున్నాయని ఓ సర్వే తెలిపింది.

ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచులు ప్రారంభ దశలోనే ఉన్నాయని ... పోను పోను ఈ సేల్స్ మరింత పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్ నుంచి కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రివరీస్ సంస్థ 25శాతం లాభాలను నమోదు చేసింది. మద్యం మార్కెట్లో దాదాపు 39.2శాతం మార్కెట్ను ఒక్క యునైటెడ్ బ్రివరీస్ సంస్థనే శాసించడం విశేషం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications