Lady: విదేశాల్లో ఉద్యోగం, బ్రిటీష్ అధికారులు అని చెప్పి ఏం చేశారంటే, ఐటీ హబ్ లో !
ఉన్నత చదువులు చదివిన చాలా మంది యువతి, యువకులు విదేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్న 25 ఏళ్ల యువతిని టార్గెట్ చేసుకున్న కన్నింగ్ ముఠా ఆమె నుంచి లక్షలాది రూపాయలు లాగేశారు.
పుదుచ్చేరి/బెంగళూరు/చెన్నై: విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని చాలా ఆశ ఉంటుంది. ఉన్నత చదువులు చదివిన చాలా మంది యువతి, యువకులు విదేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్న 25 ఏళ్ల యువతిని టార్గెట్ చేసుకున్న కన్నింగ్ ముఠా ఆమె నుంచి లక్షలాది రూపాయలు లాగేశారు. ఉగండాకు చెందిన నిందితులు తమిళనాడు, బెంగళూరులో మకాం వేసి యువతికి నకిలి అపాయింట్ మెంట్ లెటర్ మెయిల్ లో పంపించి చివరికి ఆమెకు సినిమా చూపించారు. పోలీసుల ఎంట్రీతో విదేశీయులకు చుక్కలుకనపడ్డాయి.

విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలని ?
పుదుచ్చేరిలోని అరియంగుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్నన యువతి విదేశాల్లో ఉద్యోగం కోసం ఆన్లైన్లో నమోదు చేసుకుంది. డిసెంబరు 2వ తేదీన ఆ యువతికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను భారత్లోని బ్రిటీష్ ఎంబసీలె సీనియర్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీ కోసం కెనడాలో మంచి ఉద్యోగం సిద్ధంగా ఉంది, మీరు కెనడా వెళ్లడానికి సిద్దంగా ఉండాలని చెప్పాడు.

విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నామని ?
కొన్ని రోజుల తరువాత ఇద్దరు వ్యక్తులు అదే యువతికి ఫోన్ చేసి ఆమెకు మాయమాటలు చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ ఆమెకు మెయిల్ చేశారు. ఉద్యోగం సెక్యూరిటీ కోసం, వీసా కోసం డిపాజిట్ చెల్లించాలని ఆమెను నమ్మించి అప్పటి నుంచి పుదుచ్చేరి యువతికి మాయమాటలు చెప్పి వివిధ బ్యాంకు ఖాతాలకు పలు వాయిదాల్లో రూ. 36 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ఎన్ని రోజులకు కాల్ లెటర్ రాకపోవడంతో కెనడా కంపెనీ నుంచి వచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ గురించి ఆరా తీస్తే అది నలికి అని తెలుసుకున్న యువతి హడలిపోయింది.

నైజీరియా కేటుగాడు
దీంతో ఆ యువతి పుదుచ్చేరి సీపీసీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నైజీరియాకు చెందిన రూబెన్ నైమిక్ అనే నినందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో యువతికి బెంగళూరు నుంచి ఈ-మెయిల్ పంపినట్లు తేలింది. అనంతరం ఇన్స్పెక్టర్ సురేశ్బాబు సహా పోలీసులు బెంగళూరు వెళ్లారు.

బెంగళూరులో మకాం
బెంగళూరులో తలదాచుకున్న ఉగాండాకు చెందిన నమెల్ ప్రోసీ(29)ని అరెస్ట్ చేసి అతని పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహకరించిన బెంగళూరుకు చెందిన రాజేష్ (32)ని కూడా పుదుచ్చేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తుల నుంచి ఆరు సెల్ఫోన్లు, లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన ఇద్దరినీ పుదుచ్చేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications