ప్రధాని మోడీ టార్గెట్ గా కుట్ర-ఛేదించిన బీహార్ పోలీసులు-ఇద్దరు అరెస్టు

బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారన్న అనుమానంతో ఓ టెర్రరిస్టు మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించారు . ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పోలీసులు చెబుతున్న నివరాల ప్రకారం ఈ మాడ్యూల్ 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని యోచిస్తోంది. జూలై 12న ఆయన పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకునేందుకు కూడా కుట్ర జరిగిందని తెలిపారు.
అరెస్టయిన ఇద్దరిని అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్‌గా గుర్తించారు.

ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందుతున్నారు. జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించారు. అనుమానిత ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు, వాటిలో ఒకటి '2047 ఇండియా టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా'. వారి నుంచి 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

bihar police bust terror module planning to target pm modi-two arrested

ఇంటెలిజెన్స్ బ్యూరో పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు, కేంద్ర సంస్థలు జూలై 11 న నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. దీంతో కుట్ర భగ్నమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+