పెళ్లామా..? పిశాచమా..? భర్త పార్ట్ కొరికి మింగేసింది..
భార్య చేతిలో మరో మొగుడు బలి.. ఈ వార్త ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇప్పుడో కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలే కనిపిస్తున్నాయి. ప్రియుడిని మర్చిపోలేక కొందరు.. భర్తలతో గొడవ పెట్టుకుని మరికొందరు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్నవాళ్లు కొందరైతే.. భర్తతో నిత్యం గొడవ పడుతూ వారికి హాని కలిగిస్తున్న వాళ్లు మరికొందరు.. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లంటేనే యువత పారిపోతున్న సందర్భం నెలకొంది.
Bihar Crime News: बिहार में घरेलू कलह ने लिया हिंसक रूप, दांतों से पति की जीभ काटकर निगल गई पत्नीhttps://t.co/vaTxa5oQOX
— FirstBiharJharkhand (@firstbiharnews) July 23, 2025
తాజాగా బిహార్ లోని గయాలో ఇలాంటి ఘటనే జరిగింది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భర్తపై దాడికి దిగిన భార్య అతడి నాలుకను కొరికి మింగేసింది. గయాలోని కిజార్ సరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ఛోటే దాస్ కు తన భార్యతో చిన్న గొడవ జరిగింది. ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను కొరికి కొంత భాగం మింగేసింది. ఈ విషయాన్ని స్థానికులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

భార్య.. భర్త నాలుక కొరకడంతో ఛోటే దాస్ కు అధిక రక్తస్రావం అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో మగధా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చాక కూడా భార్య.. ఛోటే దాస్ తో గొడవ పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేసు నమోదు చేయలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications