బీజేపీది దొడ్డిదారి: తమిళ రాజకీయాలపై నగ్మా సంచలనం
తమిళనాడు ప్రజల గోడు పట్టించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని మండిపడ్డారు.
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల గోడు పట్టించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని మండిపడ్డారు. సత్యమూర్తిభవన్లో గురువారం జరిగిన తమిళనాడు మహిళా కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీరాణితోపాటు నగ్మా మీడియాతో మాట్లాడారు.
తమిళనాడులో కరవు బాధిత రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో పోరాడారని, అయితే వారి గోడు పట్టించుకోవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నెట్టకూడదని, అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల డిమాండ్లు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు.

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో సంబంధం ఉన్న అందరూ శిక్ష పొందాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో బీజేపీకి ఒక శాతం కూడా మద్దతు లేదని, ఎలాగైనా రాష్ట్రంలో కాలుమోపడానికి చూస్తోందని తెలిపారు. అన్నాడీఎంకేలో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దొడ్డిదారిలో తమిళనాడులో ప్రవేశించేందుకు యత్నిస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేదన్నారు.
రాష్ట్రంలో నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలు తెరుస్తున్నందుకు నిరసనగా మహిళలు పోరాడుతున్నారని తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం గౌరవించాలని, అడ్డదారిలో మద్యం దుకాణాలు తెరవడానికి ప్రయత్నించకూడదని పేర్కొన్నారు. మహిళలను కించపరచిన కేరళ మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు. ఇదే డిమాండ్తో కేరళలో ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
-
నాకు నయనతార కావాలి...తమిళ నోటి దురద -
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications