స్పీకర్ నిర్ణయం తర్వాతే.... బీజేపీ స్పందిస్తుంది... యడ్యూరప్ప...!
ఎమ్మెల్యేల రాజీనామలపై కర్ణాటక స్పికర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ స్పందిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యురప్ప స్పష్టం చేశారు. కాగా జరుగుతున్న పరిణామాలను పరీశీస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు బీజేపీ జాతీయ పార్టీ అని, పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాత ఏ చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభంలో స్పికర్ నిర్ణయం నిర్ణయం కీలకంగా మారింది. రాజీనామ చేసిన ఎమ్మెల్యేల రాజీనామను ఆమోదిస్తారా లేక పెండింగ్లో పెడతారా అనేది ఉత్కంఠగా మారింది. దీంతో ఒకవేళ స్పీకర్ రాజీనామాలు అంగీకరిస్తే ఆ తర్వాత బలం ఉన్న బీజేపీనే అధికారం చేపట్టాల్సిందిగా అహ్వనించననున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడుతుందని స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో జోష్ నిండింది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో రాజీనామాల తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ముంబాయి హోటల్లో ఉన్న రాజీనామ చేసిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. ఇక అమేరికా నుండి నేరుగా బెంగుళూరుకు చేరుకున్న సీఎం కుమారస్వామి పార్టీ నేతలతో సమావేశమయ్యారు.