సబ్ కా వికాస్ కోసమే బీజేపీ, మిగితా వాళ్లు మాత్రమే కుటుంబాల కోసమే: మండిలో ప్రధాని మోడీ

షిమ్లా: ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ధౌలసిద్ధా హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌తో పాటు రేణుకాజీ డ్యామ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అనంతరం మండిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.

జలవిద్యుత్ ప్రాజెక్టులు వాతావరణ అనుకూల నవ భారతదేశంలో భాగమని, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉన్నాయని ప్రధాని అన్నారు. అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు దేశం చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని మోడీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు పూర్తి రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సంవత్సరం వేడుకలు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని పహారీ భాషలో ప్రారంభించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితానికి దిశానిర్దేశం చేయడంలో హిమాచల్ భూమి ముఖ్యమైన పాత్ర పోషించిందని ప్రధాని అన్నారు.

BJP Works For Sabka Vikas, Other parties Work For Parivar Ka Swarth: PM Modi in Mandi

సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్ ద్వారా కంగనిధర్ హెలిప్యాడ్‌లో దిగారు. ప్రధాని మోడీ రాగానే చిన్న కాశీ సంగీత వాయిద్యాలతో ప్రతిధ్వనించింది. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్వాగతం పలికారు. ఇన్వెస్టర్స్ మీట్ రెండో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

ప్రకృతి ఖేతి ఖుషాల్ కిసాన్ యోజన ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ చాలా సేపు పరిశీలించారు. ఈ సందర్భంగా, పథకం డైరెక్టర్, రాకేష్ కన్వర్, హిమాచల్ ప్రదేశ్‌లోని సహజ వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించారు.ఇక, 210 మెగావాట్ల ప్రాజెక్టును రూ.1800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న లుహ్రీ మొదటి దశ జలవిద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

మండిలోని ధౌలా సిద్ధ జలవిద్యుత్ , రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టులతో సహా రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
మండిలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాత్రమే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం పనిచేస్తుందని, ఇతర పార్టీలు తమ కుటుంబ స్వార్థం కోసం పనిచేస్తున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 15-18ఏళ్ల వయస్కులవారికి కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+