వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ఎఫెక్ట్ : ఢిల్లీ-లాహోర్‌ల మధ్య యథాతథంగా నడుస్తున్న బస్సు సర్వీసులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

The Delhi-Lahore Bus Service Is Running As Usual | Oneindia Telugu

ఢిల్లీ: భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి సరిహద్దుల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరిహద్దులో నివసిస్తున్న ప్రజలపై పలు ఆంక్షలు విధించడంతో వారికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ రోజుల్లో ఇరుదేశాల నుంచి చిరు వ్యాపారులు సరిహద్దులు దాటి తమ వ్యాపారాలు నిర్వహించుకుని తిరిగి తమదేశాలకు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల ఆంక్షలతో గత మూడురోజులుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సరిహద్దులో నివసించే చాలామంది ప్రజలది రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా చిరువ్యాపారులు భారీ నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ భారత్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ రైల్వే అధికారులు అటారీ స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రయాణికులంతా లాహోర్ స్టేషన్‌లో ఇరుక్కుపోయారు.

Bus service between Delhi-Lahore continues amid the tensions

ఇదిలా ఉంటే ఢిల్లీ - లాహోర్‌ల మధ్య నడిచే బస్సు సర్వీసులు మాత్రం యథాతథంగానే ఉన్నట్లు సమాచారం. బుధవారం కూడా 10 మంది ప్రయాణికులు బస్సులో బయలు దేరి లాహోర్‌కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఆ ప్రభావం బస్సు సర్వీసుపై పడింది. సాధారణ రోజుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకంటే తక్కువగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ కింద లాహోర్‌కు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఢిల్లీ గేట్ దగ్గర అంబేడ్కర్ స్టేడియం బస్సు టర్మినల్ నుంచి లాహోర్‌కు బస్సు బయలుదేరుతుంది. వారంలో మూడురోజులు ఈ సర్వీసులుంటాయి. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో సర్వీసులు ఉంటాయి. ఇక పాకిస్తాన్ నుంచి ఈ బస్సులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాల్లో ఢిల్లీకి బయలుదేరుతాయి.

English summary
The Delhi-Lahore bus service is running as usual, an official said Wednesday."The service is continuing. Even today, 10 persons boarded the Lahore-bound bus," Manoj Kumar, the managing director of the Delhi Transport Corporation (DTC), told PTI.In the aftermath of the Pulwama attack, the bus service was affected and the number of passengers using it had gone down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X