జగన్కే కాదు: డీఎంకే స్టాలిన్కూ ప్రశాంత్ కిషోరే కావాలట
చెన్నై: 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని అవడంలో, బీహార్లో నితీష్ కుమార్, పంజాబ్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా, ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు సేవలందించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.
Recommended Video
దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, 2021లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుత తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత లేకపోవడంతో ఆ లోటును అందిపుచ్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల్లో పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ వైపే ఓటమి పాటలో ఉన్న పార్టీలు చూడటం గమనార్హం.