వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపేశారు: అహ్మదాబాద్ యువకుల పైశాచికం(వీడియో)

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన కొందరు యువకులు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఆ ఎనిమిది మంది దుర్మార్గులు ఓ వృద్ధుడ్ని దారుణంగా కొట్టి చంపారు.

వివరాల్లోకి వెళితే.. ఓ పాన్ డబ్బా దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారు ఆ ఎనిమిది యువకులు. ఆ తర్వాత తీసుకున్న వస్తువులకు డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమానిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు.

అనంతరం అతడ్ని ఆ దుర్మార్గులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేని బాధితుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన జరిగింది నడిరోడ్డుపైనే. అక్కడ ప్రాణాలున్న చాలా మంది సంచరిస్తున్నారు.

Caught on CCTV camera, 8 youth beat old man to death in Ahmedabad

కానీ, వారిలో మానవత్వమే లేనట్లుగా ఇటువైపు చూడకుండానే వెళ్లిపోయారే తప్ప.. అతడి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ దారుణ ఘటన మొత్తం సిసి కెమెరాల్లో రికార్డయింది.

కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాని నిందితుడితోపాటు మరో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.

English summary
In a shocking incident, as many as eight youth mercilessly beat up an elderly man to death in Ahmedabad. The incident has been caught on a CCTV camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X