'ఆలేరు' పోలీసుకు శౌర్య: వెంకయ్య, రాహుల్గాంధీది వారి వ్యవహారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులకు శౌర్య పథకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. శుక్రవారం హైదరాబాదులో వెంకయ్య మీడియాతో మాట్లాడారు.
రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారన్నారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందాక కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు తేమ శాతాన్ని 27 శాతానికి పెంచినట్లు చెప్పారు.
అకాల వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు ఇచ్చాక కేంద్రం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. భూసేకరణ పైన కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్ధాంతం అన్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు.
వెంకయ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
వెంకయ్య
గురువారం నాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాదులోని కూకట్పల్లిలో ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల పైన ఇష్టాగోష్టి నిర్వహించారు.
వెంకయ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
వెంకయ్య
తెలంగాణ రాష్ట్రంలో సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులకు శౌర్య పథకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు.