మెట్రో రైలులో బ్లాక్ బాక్స్ లు
చెన్నై: మెట్రో రైలు ప్రయాణం సురక్షితం చెయ్యడానికి చెన్నై అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదాలు నమోదు చెయ్యడానికి వీలుగా విమానాల్లో ఏర్పాటు చేసే బ్లాక్ బాక్స్ లను చెన్నై మెట్రో రైలులో అమర్చారు. మెట్రో రైలు ప్రయాణికులు విషయం తెలుసుకుని సంతోషంగా ఉన్నారు.
సుందర చెన్నైని మరింత సుందరంగా మారుస్తూ నిర్మితమైన అత్యాధునిక మెట్రో రైలు గత ఏడాది (2015) జూన్ ప్రారంభం అయ్యింది. మొత్తం 45.1 కిలోమీటర్ల దూరం మెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దిశలో 10 కిలో మీటర్ల మెట్రో సంచారాన్ని ప్రారంభించారు.
అలందూర్ , కోయం బేడు మధ్యలో సంచరించే మెట్రో రైలు చార్జీల ధర ఎక్కువగా ఉందని ప్రచారం జరగడంతో ప్రయాణికుల ఆదరణ లభించలేదు. మెట్రో రైలు ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ 9 నెలల కాలంలో ఓ మోస్తరుగా ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు.

మెట్రో రైలు యాజమాన్యం కొత్త అంశాల గురించి ఆలోచిస్తు ముందుకు వెలుతున్నది. చెన్నైలో పరుగులు తీస్తున్న మెట్రో రైలులో ఇటీవల బ్లాక్ బాక్స్ లు అమర్చారు. విమానంలోని బ్లాక్ బాక్స్ లాగానే ఇవి కూడా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తాయి. విమానాల్లోని డేటా రికార్డర్ అనే బ్లాక్ బాక్స్ విమానానికి సంబంధించి అన్ని వ్యవహారాలు తానంతట తానే రికార్డు చేస్తుంది.
విమానం ప్రమాదానికి గురైన సందర్బంలో బ్లాక్ బాక్స్ ను సేకరించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. ఇలాంటి బ్లాక్స్ బాక్స్ లను మెట్రో రైలులో ఏర్పాటు చేశారు. రైలులో ఎదైనా సాంకేతిక లోపం ఎర్పడినా వెంటనే విషయం గుర్తించిన ఈ బ్లాక్ బాక్స్ లు డ్రైవర్ తో పాటు కంట్రోల్ రూంకు సమాచారం అందిస్తుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications