leader: నాతో పెట్టుకుంటే ఇక్కడ బతకలేరు, డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు !
చెన్నై: దేవాలయం భూముల్లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 63 ఏళ్ల వ్యక్తిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. నాతో పెట్టుకుంటే ఇక్కడ బతకలేరని దేవాల భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు.
చెన్నైలోని
తిరువల్లికేణిలోని
డాక్టర్
నటేసన్
వీధిలో
శంకర్
అనే
ఆయన
నివాసం
ఉంటున్నాడు.
అదే
ప్రాంతంలో
నిర్మాణ
యంత్రాలు
అద్దెకు
ఇచ్చే
దుకాణం
నడుపుతున్నాడు.
హిందూ
పీపుల్స్
పార్టీ
నాయకుడు
మహేష్తో
కొంతకాలం
క్రితం
శంకర్కు
పరిచయం
ఏర్పడింది.
తరువాత
శంకర్,
మహేష్
స్నేహంగా
మెలిగారు.
తీర్థపాలీశ్వర
దేవాలయం
స్థలంలో
ఇల్లు
కట్టుకున్నావని
శంకర్ను
మహేష్
బెదిరించి
డబ్బులు
వసూలు
చేయడం
ప్రారంభించాడు.
అరెస్టయిన మహేశ్ను విచారించగా ఇప్పటికే పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. తీర్థపాలీశ్వర ఆలయానికి చెందిన భూమిలో చాలా కుటుంబాలు అద్దెకు ఉంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హిందూ పీపుల్స్ పార్టీకి చెందిన మహేశ్ అనే వ్యక్తి ఆలయ భూమిని లీజ్ కు తీసుకుని నివాసముంటున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడ బతకలేరని బెదిరించిన మహేష్ పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే మహేష్ పై ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు 3 కేసులు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు చెప్పారు. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు మహేష్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని చెన్నై పోలీసులు తెలిపారు.