వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'యూపీఏ ఓటమికి ప్రణబ్ ముఖర్జీ ఉద్దీపన ప్యాకేజినే కారణం'
న్యూఢిల్లీ: ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టిక్కెంచాలన్న ఉద్దేశ్యంతో 2008-09లో యూపీఏ ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజి కాంగ్రెస్ ఓటమికి ఒక కారణమైందని మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరపున ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజి దేశ ఆర్ధక వ్యవస్ధను ఒడిదుడుకుల్లోకి నెట్టిందని అన్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2008-09లో ఆర్ధిక మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. దీని వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగిందన్నారు. ఆహార, వస్తు ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజల్లో యూపీఏపై వ్యతిరేకతను పెంచేలా చేశాయన్నారు.
ఉద్దీపన ప్యాకేజి వల్ల ఆదాయ లోటు, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు లక్ష్యాలను అందుకోలేక పోయామని అన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఏకంగా 14 శాతానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు.
Comments
English summary
Former finance minister P Chidambaram on Saturday said the Congress-led UPA lost the 2014 polls owing to a stimulus package announced in 2008-09 to pep up the economy in the wake of the global recession. Pranab Mukherjee was the finance minister at that time.
Story first published: Sunday, March 8, 2015, 13:46 [IST]