చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కంట కన్నీరు...పార్టీ అధ్యక్ష పదవి వీడ్కోలులో ఆవేదన...
పార్టీ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ పార్టీ పదవులకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఓటమికి తానేక్కడినే నైతిక భాద్యత వహించాలా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించడంతో పలు రాష్ట్ర్రాల నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
అయితే కొద్దిమాత్రం తమ పదవులను బలవంతంగా వదులుతున్నారు.. ఇన్నాళ్లుగా పార్టీ నేతలుగా చలామణి అయిన వారు పార్టీని విడిచిపోయోందుకు వెనకడుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇప్పటి వరకు కొనసాగారు. ఇప్పుడాయన ముఖ్యమంత్రి కావడంతో ఆ బాధ్యతలను వేరొకరికి అప్పగించాల్సిందిగా కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీని కోరారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు కాంగ్రెస్ అధిష్ఠానం మోహన్ మార్కమ్ను నూతన అధ్యక్షుడిగా నియమించింది. ఈనేపథ్యంలో నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సహకరించిన కాంగ్రెస్ నేతలందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2013లో తనను రాష్ట్ర అధ్యక్షుడిగా రాహుల్ నియమించారని తెలిపారు. 2014లో ఓటమి తర్వాత పార్టీలో మార్పులు తీసుకురావడానికి ఎంతో కృషి చేశామన్నారు. సభలో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న నేతలందరూ 'బఘేల్ జిందాబాద్..కాంగ్రెస్ పార్టీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.