డ్రాగన్ దుశ్చర్య: అక్షయ్ చిన్ వద్ద హెలీపోర్టు.. అక్టోబర్లో పనులు స్టార్ట్, శాటిలైట్ ఇమేజేస్
డ్రాగన్ చైనా తన బుద్దిని మార్చుకోవడం లేదు. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపుతో కవ్వింపు చర్యలకు దిగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్షయ్ చిన్ వద్ద హెలిపోర్టు నిర్మాణానికి పూనుకుంది. దీంతో భారత్ చర్యకు ప్రతీ చర్య అనే సంకేతాలను డ్రాగన్ ఇస్తోంది. అందుకు ధీటుగానే భారత్ కూడా స్పందిస్తోంది. తూర్పు లడాఖ్లో గత 9 నెలలుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఇక్కడ చైనా చేసే ప్రతీ చర్య శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలిసిపోతోంది. భారత సరిహద్దు గుండా చైనా బలగాలను మొహరిస్తోంది. టిబెట్, తూర్పు తర్కిస్తాన్ వద్ద నుంచి క్రమంగా కదులుతోంది. అయితే తేక్నె లడాఖ్ వద్ద గల క్రిస్ బిగ్గర్స్వద్ద చైనా హెలీపోర్టు నిర్మిస్తోంది. భారత్ దౌలత్ బెగ్ ఓల్డీకి అపోజిట్లో చైనా నిర్మాణానికి పూనుకున్నది. ఇదీ ఎల్ఏసీకి సమీపంలో ఉండటం విశేషం.
అక్షయ్ చిన్ వద్ద పీఎల్ఏ నిర్మిస్తోన్న హెలిపోర్టు ఇమేజ్స్ను ఇండియా టుడే ప్రచురించింది. ఇక్కడ హెలీపోర్టు నిర్మించాలని ఆగస్టులో ప్రాంతాన్ని కేటాయించారు. అక్టోబర్ నెలలో పనులు ప్రారంభించారు.