భారత్ అదుపులో చైనా సైనికుడు- లడఖ్ సరిహద్దు దాటి చిక్కిన వైనం-ఆర్మీ విచారణ
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా ఉందని పలు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. మంచు గడ్డకట్టే చలిలోనూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు పరిస్ధితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో లడఖ్ సమీపంలోని దక్షిణ ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ దాటి భారత్లోకి ప్రవేశించిన ఓ చైనా సైనికుడిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది.
Recommended Video
కొన్ని నెలలుగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉన్న ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద చైనా సైనికుడిని ఆర్మీ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. వాస్తవాధీన రేఖ అతిక్రమించి భారత భూభాగంలోకి వచ్చిన ఇతడిని ఆర్మీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వాస్తవాధీన రేఖ దాటి రావడం వెనుక కారణాలను ఆరా తీస్తోంది. ఈ సైనికుడు భారత స్ధావరాలపై నిఘా పెట్టేందుకు ఇక్కడికి వచ్చాడా లేక దారి తప్పి వచ్చాడన్న అంశాలపై అతన్ని ప్రశ్నిస్తున్నారు.

చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై ఆర్మీ కానీ కేంద్రం కానీ పూర్తి స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఓ సైనికుడు చిక్కాడన్న వార్త మాత్రమ ప్రస్తుతానికి ఆర్మీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఈ ప్రాంతంలో నిఘా చర్యలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే సైనికుడిని ఉద్దేశపూర్వకంగా పంపిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications