మరో రెండు నెలల్లో అక్కడ రూ.1కే కార్పొరేట్ వైద్యం

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐదు మెట్రో రైల్వేస్టేషన్లలో కేవలం రూపాయికి వైద్యం అందించే ఆస్పత్రులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్ వైద్యం అంటేనే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రూ. 1కే వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రులు ముందుకు రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులతో వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం. ప్రతీ రోజూ 24గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ ఆస్పత్రులు. ఈ ఆస్పత్రుల్లో చిన్నవ్యాధి నుంచి అత్యవసర చికిత్స వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.

Clinic charging Re 1 per patient to come up at 5 Mumbai stations

అంతేగాక, ఈ ఆస్పత్రుల్లో 24గంటలపాటు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. అవసరమైతే ఛర్మ వ్యాధులు, డయాబెటీస్, ప్రసూత స్పెషలిస్టులు కూడా వస్తుంటారని చెబుతున్నారు. అంతేగాక, ఏవైనా పరీక్షలు చేయించుకున్నా, మందులు కొనుగులో చేసినా ఇక్కడ అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి.

కాగా, ఈ ఆస్పత్రులు ముంబైలోని 5మెట్రో స్టేషన్ల వద్ద మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. కుర్లా, ఘట్‌కోపర్, ములంద్, వదాల, దాదార్ స్టేషన్లలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ముంబైకి చెందిన వైద్యులు రాహుల్ ఘూలె, అమోల్ ఘూలెలు ఈ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం రైల్వే శాఖ ఉచితంగా స్థలాలను అందజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+