సీఎం ప్లాన్, అన్ని క్యాంటీన్లలో నందిని, ఇక జాతరే అంటున్న బీమా నాయక్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు రాకుండా సిద్దరామయ్య అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి అనేక విధాలుగా ఆర్థికంగా లాభాలు తీసుకురావడానికి సీఎం సిద్దరామయ్య అనేక చర్యలు తీసుకుంటున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇందిరా క్యాంటీన్ల మళ్లీ ప్రారంభించాలని, ఇందిరా క్యాంటీన్ల సంఖ్యను పెంచాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం, ఇందిరా క్యాంటీన్లకు మరింత హైటెక్ రూపం ఇవ్వాలని నిర్ణయించింది. నందిని పాల ఉత్పత్తులను ఇందిరా క్యాంటీన్లలో విక్రయించాలని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే భావించారని వెలుగు చూసింది.

అందుకే సీఎం సిద్ధరామయ్యను కలిసి నందిని నుంచి ఏయే ఉత్పత్తులు కావాలో చర్చిస్తామని బుధవారం కేఎంఎఫ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అయిన భీమా నాయక్ తెలిపారు. గురువారం కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ బెంగళూరులో మీడియతో మాట్లాడారు. నందినిని కాపాడటానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంచి నిర్ణయాలు తీసుకుంటారని భీమా నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐటీ హబ్, సిలికాన్ సిటీ బెంగుళూరులోని ఇందిరా క్యాంటీన్లను వీలైనంత హైటెక్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. రాబోయే రోజుల్లో నందిని ఐస్క్రీమ్ లు, చాక్లెట్లు, బిస్కెట్లు, పాలు, పెరుగు, నెయ్యి కూడా ఇందిరా క్యాంటీన్లో వేడి భోజనంతో పాటు అందుబాటులోకి రానున్నాయని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు.

కేఎంఎఫ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చాలా ఆలోచించాయని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. ఇందిరా క్యాంటీన్లలో నందిని వ్యాపారాన్ని పెంచాలని భావించిన ప్రభుత్వం, కేఎంఎఫ్ సహకారంతో ఇందిరా క్యాంటీన్లలో నందిని స్టోర్ను ప్రారంభించాలని భావించింది. ఇలా నందిని ఖజానాను నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం, కొత్త కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ గురువారం మీడియాకు చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications