College girl:బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్లిన అమ్మాయి, పోలాల్లో ఆరు మంది గ్యాంగ్ రేప్, కులం అడ్డం !
లక్నో/బరేలి/చెన్నై: ఇద్దరు కాలేజ్ స్నేహితులతో కలిసి సాయంత్రం యువతి స్కూటీలో బయటకు వెళ్లింది. ఊరి చివరిలోని ఓ దేవాలయం సమీపంలో నిలబడి బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న యువతి మీద కామాంధులు దాడి చేశారు. లాక్ డౌన్ టైమ్ లో నువ్వు బయటకు ఎందుకు వచ్చావు అంటూ నిందితులు ఆమె ప్రియుడి మీద దాడి చేశారు. యువతిని సమీపంలోని పోలంలోకి లాక్కెళ్లిన ఆరు మంది కామంధులు గ్యాంగ్ రేప్ చేశారు. విషయం బయటకు తెలిస్తే నీ గ్యాంగ్ రేప్ వీడియోలు బయటపెట్టి నిన్ను చంపేస్తామని యువతిని బెదిరించడం కలకలం రేపింది. ప్రాణభయంతో యువతి వారం రోజుల తరువాత జరిగిన విషయం పోలీసులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
Lady teacher: కత్తిలాంటి మేడమ్, కండలు తిరిగిన విద్యార్థి రొమాన్స్, ఎస్కేప్, కిడ్నాప్ కేసుతో!
కాలేజ్ అమ్మాయి
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 19 ఏళ్ల అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మే 31వ తేదీన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత ఇద్దరు స్నేహితులు (మగ స్నేహితులు)తో కలిసి స్కూటీలో ఊరి బయటకు వెళ్లింది. ఊరి సమీపంలోని ఓ ఆలయం దగ్గర నిలబడి ముగ్గురు మాట్లాడుతున్నారు.
లాక్ డౌన్ లో మీకు ఏం పని...... నీకు ఇద్దరు కావాలా ?
గుడి దగ్గరకు ముగ్గురు నిందితులు వెళ్లారు. నువ్వు తక్కువ కులం (దళితురాలు), ఇక్కడికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చి ఏం చెయ్యాని వచ్చావు, నీకు కులకడానికి ఇద్దరు కావాలా అంటూ కామాంధులు రెచ్చిపోయారు. అమ్మాయి వెంట ఉన్న ఇద్దరు అబ్బాయిలను పట్టుకుని చితకబాదేశారు. ఒక అబ్బాయి పారిపోవడంతో మరో యువకుడిని పట్టుకుని చితకబాదేశారు.
పొలాల్లో ఆరు మంది గ్యాంగ్ రేప్
అమ్మాయి స్నేహితుడిని చితకబాదడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే కాలేజ్ అమ్మాయిని పోలాల్లోకి లాక్కెళ్లిన కామాంధులు ఒకరి తరువాత ఒకరు ఆరు మంది సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బయకు చెబితే నీకే నష్టం, ఆరు మంది నిన్ను అనుభవించారు అని వెలుగు చూస్తే మీ కుటుంబం పరువు పోతుందని, ఇప్పుడే నీది తక్కువ జాతి అని, నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోరని కామాంధులు బెదిరించారు.
భయంతో పోలీసు కేసు ?
పోలాల్లో నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చిన అమ్మాయి స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకునింది. తక్కువ కులం కావడంతో, ఈ విషయం బయటకు తెలిస్తే నువ్వు మగ స్నేహితులతో బయటకు ఎందుకు వెళ్లావు ? అని అందరూ ప్రశ్నిస్తారనే భయంతో ఇన్ని రోజులు అమ్మాయి కేసు పెట్టడానికి వెనకడగు వేసింది. చివరికి బాధితురాలు సోదరుడికి విషయం చెప్పి అతనితో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు మంది కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం వెలువరించింది.