సెక్స్ రాకెట్ రగడ: రాళ్లు రువ్విన స్థానికులు, పోలీసులకు గాయాలు
ఢిల్లీ: వ్యభిచార ముఠాను రట్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు గాయపడ్డ సంఘటన ఢిల్లీలో జరిగింది! ఢిల్లీలోని నారెల ప్రాంతానికి వెళ్లిన పలువురు పోలీసుల పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది పోలీసులు గాయపడగా, ఐదు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు దెబ్బతిన్నాయి.
పోలీసులు ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో రైడ్ చేశారు. అప్పుడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు స్పాట్కు వెళ్లారు. వారు అక్కడకు వెళ్లిన సమయంలో కొందరు మహిళలు ఓ మహిళ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమె సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందని ఆరోపించారు.
ఆ సమయంలో పోలీసులు ఆమెకు చెందిన ఇంట్లో ఐదుగురిని గుర్తించారు. అందులో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు ఆమె బంధువులు అని, పురుషులు వారి స్నేహితులు అని.. వారు చూసేందుకు వచ్చారని చెప్పినట్లు అధికారులు తెలిపారు.

అనుమానితులను పోలీసులు తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న గుంపులోని కొందరు వారు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, వారి పైన రాళ్లు వేశారు. వారు పోలీసుల ప్రోత్సాహంతోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఆ యువకులు తమ స్నేహితులు అని, తమను కలిసేందుకు వచ్చారని, ఇద్దరు యువతులు, ఆ ఇంటికి చెందిన మహిళ చెప్పారని, అయితే, అక్కడే ఆగ్రహంతో ఉన్న గుంపుకు నచ్చ చెప్పేందుకు తాము ప్రయత్నించామని, అంతలోనే కొందరు ఇంటిలోకి చొచ్చుకెళ్లడంతో హింసాత్మకంగా మారిందని పోలీసులు చెప్పారు.
రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ పోలీసుకు చెయి ఫ్యాక్చర్ కూడా అయింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంతమంది పోలీసు బలగాలని దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సహకారంతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న స్థానికుల ఆరోపణల పైన పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications