భారత్ లో భారీగా క్షీణించిన కరోనా కొత్త కేసులు .. 30 వేలకు దిగువకు కొత్త కేసులు, 415 మరణాలు భారతదేశంలో కరోనా ఉ
భారతదేశంలో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతున్న పరిణామాలు దేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. 132 రోజులలో భారతదేశం మొదటిసారిగా 30,000 కన్నా తక్కువ కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరుకున్నాయి.గత 24 గంటల్లో 29,689 తాజా కొత్త కేసులు నమోదు కాగా ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది.
దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 3,98,100 గా నమోదయింది. ఇది మొత్తం కేసులలో 1.27%. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా బులెటిన్ ప్రకారం 4 లక్షల కన్నా తక్కువ క్రియాశీల కేసుల పతనం కూడా 124 రోజుల తరువాత తొలిసారిగా నమోదయింది. గత 24 గంటల్లో 415 మంది ప్రాణాలు కోల్పోగా, 42,363 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇది మరణాల సంఖ్యను 4,21,382కు చేర్చింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన రికవరీలు 3,06,21,469గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనావైరస్ కోసం 17,20,100 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. మొత్తం 45,91,64,121 కు చేరుకుంది. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా 66 లక్షల వ్యాక్సిన్ల మోతాదులు గత 24 గంటల్లో ఇవ్వబడ్డాయి. జాతీయ టీకాల డ్రైవ్లో భాగంగా టీకాల మొత్తం సంఖ్య 44.19 కోట్లకు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.