భారతదేశంలో కరోనా ఉగ్రరూపం: 2లక్షలకు చేరువగా కొత్తకేసులు; 5వేలకు చేరువగా ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాస్త తగ్గినట్టు అనిపించినా కరోనా కేసులు ఈ రోజు మళ్ళీ ఉధృతంగా కొనసాగాయి. రెండు లక్షలకు చేరువగా భారతదేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది.
Recommended Video
రెండు లక్షలకు చేరువగా కరోనా కొత్త కేసులు
భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 కోవిడ్-19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం నాడు నమోదైన 1.68 లక్షల కేసుల కంటే 15.8 శాతం ఎక్కువ. రోజువారీ సానుకూలత రేటు ప్రతి 100 పరీక్షలకు సోకిన వ్యక్తుల సంఖ్య - 11.5 శాతంగా ఉందని ప్రభుత్వ డేటా చూపిస్తుంది భారతదేశం ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నమోదు చేసినట్లు సమాచారం. ఓ పక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా 5 వేలకు చేరువ కావడం ప్రధానంగా కనిపిస్తుంది .
ఒమిక్రాన్ కేసుల్లో టాప్ త్రీలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ లు
ఇది దక్షిణాఫ్రికాలో మొదట కనుగొనబడిన అత్యంత వ్యాప్తి చెందగల కరోనావైరస్ వేరియంట్. మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ వేరియంట్ 1,281 కేసులు, రాజస్థాన్లో 645 కేసులు ఉన్నాయి. మంగళవారం నాడు 407 మంది లో కొత్తగా ఈ వేరియంట్ ని గుర్తించారు. ఓమిక్రాన్ కేసుల విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.ఇదిలా ఉంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కనీసం 120 జిల్లాలు మహమ్మారి యొక్క థర్డ్ వేవ్లో వారానికి 10 శాతం సానుకూలత రేటును నివేదించాయి.
1,94,720 కొత్త కేసులు, 442 కరోనా మరణాలు
మంగళవారం నాడు 17 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరపగా అందులో1,94,720 మంది మా మరి బారిన పడ్డారు. గత 24 గంటల్లో 442 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం క్రియాశీల కేసులు తొమ్మిది లక్షల మార్కును దాటాయి. క్రియాశీల కేసుల రేటు 2.65 శాతానికి పెరిగిపోయింది. ఇక రోజువారీ కేసులు కంటే రికవరీలు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నవారు 60,405 మంది. రికవరీ రేటు 96.01 శాతానికి తగ్గింది. మొత్తం గత 24 గంటల్లో 442 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 4.84 లక్షలకు చేరుకుంది.
యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
కరోనా మహమ్మారి నియంత్రణకు సాగుతున్న పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అధిగమించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుండి భారతదేశంలో 153 కోట్ల వ్యాక్సిన్ డోస్లు నిర్వహించి, నేటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. భారతదేశం ఫ్రంట్లైన్ మెడికల్ వర్కర్లకు మరియు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇస్తోంది. అయినప్పటికీ, ఒమిక్రాన్ వేరియంట్ ను బూస్టర్ డోస్ సైతం ఆపలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బూస్టర్ డోస్ లు కరోనా మహమ్మారిని ఆపలేవన్న నిపుణులు
బూస్టర్ వ్యాక్సిన్ డోస్లు వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఆపలేవని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జైప్రకాష్ ములియిల్ అన్నారు. . బూస్టర్ డోస్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, వైరస్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్ ములియిల్ బూస్టర్ మోతాదుల గురించి చెప్పారు. అయితే కరోనా మహమ్మారి యొక్క మూడవ వేవ్లో, చాలా మంది కరోనా సోకిన వ్యక్తులు ఇంట్లో కోలుకున్నారు. గతేడాది ఏప్రిల్ మరియు మే నెలలలో చూసిన కేసులలో సగం కంటే తక్కువ ఈసారి ఆసుపత్రిలో చేరారు.
కరోనా కేసుల ఉప్పెనతో థర్డ్ వేవ్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలెర్ట్
ఇక విపరీతంగా విస్తరిస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు ప్రకటించాయి. ఢిల్లీ కూడా గత వారం వారాంతపు లాక్డౌన్ విధించింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ను నియంత్రించే ప్రయత్నంలో ప్రైవేట్ కార్యాలయాలు మరియు రెస్టారెంట్లు మరియు బార్లను మూసివేసింది.
కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. జనవరి చివరి వారానికి మహమ్మారి పీక్స్ కు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తేలికపాటి లక్షణాలతో, ఆస్పత్రిలో చేరికలు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ, ఏమాత్రం నిర్లక్ష్యం తగదని పదేపదే హెచ్చరిస్తున్నారు.