ముంబై కరోనా నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లో 88 శాతం ఓమిక్రాన్ వేరియంట్; షాకింగ్ ఫలితాలతో టెన్షన్
దేశ ఆర్ధిక రాజధాని ముంబై కరోనా కేసులతో వణికిపోతుంది. ముంబైలోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్లో నిర్వహించిన తాజా రౌండ్ జీనోమ్ సీక్వెన్సింగ్ 88 శాతం శాంపిల్స్లో కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్ను గుర్తించింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా అధికంగా వ్యాప్తి చెందగల కొత్త వేరియంట్. ప్రస్తుతం ఈ వేరియంట్ ముంబైలో నమోదవుతున్న కేసులలో ఆధిపత్యం చెలాయిస్తుంది
తాజా కరోనా నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లో 88% ఓమిక్రాన్ వేరియంట్
క్రమబద్ధీకరించబడిన 363 నమూనాలలో, 320 అంటే మొత్తం 88% ఓమిక్రాన్ వేరియంట్ ఉనికిని చూపించాయని తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వెల్లడించాయి. నమూనాలలో 30 అంటే మొత్తం 8% డెల్టా ప్లస్ వేరియంట్లను చూపించాయి, మూడు (0.8%) డెల్టా వేరియంట్ను కలిగి ఉన్నాయి. 10 నమూనాలు 2.7% ఇతరాలను కలిగి ఉన్నాయి. ఇది గత నెలలో నిర్వహించిన మునుపటి జీనోమ్ సీక్వెన్సింగ్కు పూర్తి విరుద్ధంగా ఉంది. దీనిలో కేవలం 55% శాంపిల్స్లో ఆందోళన యొక్క తాజా వైవిధ్యం అయిన ఒమిక్రాన్ వేరియంట్ కనుగొనబడింది.
సామాజిక వ్యాప్తి దశలో కరోనా .. ఆధిపత్య వేరియంట్ గా ఒమిక్రాన్
INSACOG, వైరస్ యొక్క వైవిధ్యాలను ట్రాక్ చేస్తున్న జాతీయ ప్రయోగశాలల కన్సార్టియం, ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశలో ఉందని మరియు అనేక మెట్రోలలో ఆధిపత్యంగా మారిందని ప్రకటించింది. కోవిడ్-19 టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ, "గ్లోబల్ ప్యాట్రన్ను పరిశీలిస్తే, డెల్టా వేరియంట్లపై ఓమిక్రాన్ క్రమంగా ఆధిపత్యం చెలాయిస్తుందని భావించారు. కానీ దానిని తేలికగా తీసుకోకూడదని వెల్లడించారు. ఒమిక్రాన్లో తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, అంతకు ముందే వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
శరద్ పవార్ కు కరోనా పాజిటివ్
ఇదిలా
ఉంటే
నేషనల్
కాంగ్రెస్
పార్టీ
అధ్యక్షుడు
శరద్
పవార్కు
కోవిడ్-19
పాజిటివ్
వచ్చినట్లు
ఆయన
ట్విట్టర్లో
ప్రకటించారు.
తాను
కోవిడ్
పాజిటివ్
పరీక్షించానని,
కానీ
ఆందోళన
చెందాల్సిన
అవసరం
లేదని
ఆయన
వెల్లడించారు.
వైద్యుడు
సూచించిన
విధంగా
తాను
చికిత్సను
అనుసరిస్తున్నానని
పేర్కొన్నారు
.
గత
కొన్ని
రోజులుగా
నాతో
కాంటాక్ట్లో
ఉన్న
వారందరూ
తమను
తాము
పరీక్షించుకోవాలని
మరియు
అవసరమైన
అన్ని
జాగ్రత్తలు
తీసుకోవాలని
అభ్యర్థిస్తున్నాను
అంటూ
శరద్
పవార్
వెల్లడించారు.
ముంబై లో కరోనా కేసుల క్షీణత .. అయినా ఒమిక్రాన్ తో టెన్షన్
ముంబై
ఆదివారం
2550
తాజా
కోవిడ్
-19
కేసులను
నివేదించింది,
ముందు
రోజు
నమోదైన
3,568
కేసుల
నుండి
క్షీణతను
చూపుతుంది.
అయినప్పటికీ
ఒమిక్రాన్
వేరియంట్
దెబ్బకు
టెన్షన్
నెలకొంది.
తాజాగా
కరోనా
కారణంగా
మొత్తం
13
మంది
మరణించగా,
217
మంది
కోలుకున్నారు.
దీంతో
నగరంలో
ఇప్పుడు
19,808
యాక్టివ్
కేసులు
ఉన్నాయి.
మహారాష్ట్రలో
ఆదివారం
40,805
కొత్త
కేసులు
నమోదయ్యాయి.