ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వదలడం లేదు. వీరు వారు అన్న తేడా లేకుండా కరోనా దేశంలోని ప్రముఖులపై కూడా తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా భారతదేశం పైన కూడా తన ప్రభావాన్నిచూపిస్తుంది. ఇప్పటివరకు 19 లక్షలకు కరోనా కేసులు చేరుకున్న పరిస్థితులు దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
Recommended Video
ఇప్పటికే టాలీవుడ్ లో సినీ పరిశ్రమకు చెందిన చాలామంది కరోనా బారిన పడ్డారు. దర్శకులు రాజమౌళి, తేజ అలాగే పృథ్వీరాజ్ వంటి మరి కొందరు నటులకి కరోనా సోకింది. టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనా బారిన పడి మరణించారు. ఇదే సమయంలో సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడినట్లుగా స్వయంగా ఆమె ట్వీట్ చేశారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చెన్నైలోని చులైమెడు ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
సామాన్యులే కాకుండా, అటు రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు...వీరు వారు అన్న తేడా లేకుండా చాలామంది కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ ప్రముఖులు బిగ్ బి కుటుంబం కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనూ ఇప్పటికే చాలామంది కరోనా మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కూడా చేరారు.