Sabarimala : శబరిమలలో కరోనా ఆంక్షల ఎఫెక్ట్ ..మొదటివారం దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇదే !!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తజనంతో పోటెత్తింది.మాలధారులు శరణుఘోషతో శబరిమల కొండలు మారుమోగుతాయి. అయితే ఈ సంవత్సరం కేరళ రాష్ట్రంలో విపరీతంగా ఉన్న కరోనా వ్యాప్తికి కారణంగా భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల కారణంగా, ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రమే స్వామిని దర్శించుకోవాలని, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తీసుకు వెళ్ళిన వారిని దర్శనానికి అనుమతిస్తామని, అలాగే ప్రతి రోజూ వెయ్యి మందికి, వారాంతంలో రెండు వేల మందికి దర్శనానికి అనుమతిస్తామని నిబంధన విధించిన నేపథ్యంలో భక్తులు భారీగా తగ్గారు.
మండలం- మకరవిళక్కు పూజల కోసం శబరిమలకి వెళ్ళిన భక్తులు మొదటి వారంలో కేవలం 9,000 మంది మాత్రమేనని కేరళ రాష్ట్ర స్థానిక మీడియా పేర్కొంటుంది. గత ఏడాది మొదటి వారంలో వచ్చిన భక్తులు సుమారు 300,000 మంది కాగా, ఈ ఏడాది కేవలం తొమ్మిది వేల మంది మాత్రమే శబరిమలకి వెళ్లడం గమనార్హం.
ఆన్లైన్ ద్వారా దర్శనం స్లాట్ బుక్ చేసుకునే యాత్రికులు కూడా సుమారు 40 శాతం మంది శబరిమల యాత్ర చేపట్టలేదని సమాచారం.

చాలామంది యాత్రికులు వివిధ రకాల కరోనా నిబంధనల కారణంగా, ఇబ్బందుల కారణంగా శబరి యాత్ర ను క్యాన్సిల్ చేసుకున్నారు. యాత్రికుల సంఖ్య భారీగా తగ్గిపోవడం కారణంగా ట్రావెన్కోర్ బోర్డు ఆదాయం కూడా దారుణంగా తగ్గింది. మొదటి వారంలో హుండీ లో వేసే కానుకల ద్వారా వచ్చిన ఆదాయం ఒక మిలియన్ మాత్రమే. అయితే ఇది ఇతర సాధారణ సంవత్సరాలలో మొదటి వారంలో 35 మిలియన్లుగా ఉందని సమాచారం.యాత్రికుల సంఖ్య భారీగా పడిపోవడం కారణంగా కొట్టాయం మరియు పతనమిట్ట జిల్లాల్లోని దుకాణాలు, బసలు, రెస్టారెంట్లు మరియు అనేక ఇతర వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Recommended Video
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications