Sabarimala : శబరిమలలో కరోనా ఆంక్షల ఎఫెక్ట్ ..మొదటివారం దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇదే !!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తజనంతో పోటెత్తింది.మాలధారులు శరణుఘోషతో శబరిమల కొండలు మారుమోగుతాయి. అయితే ఈ సంవత్సరం కేరళ రాష్ట్రంలో విపరీతంగా ఉన్న కరోనా వ్యాప్తికి కారణంగా భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల కారణంగా, ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రమే స్వామిని దర్శించుకోవాలని, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తీసుకు వెళ్ళిన వారిని దర్శనానికి అనుమతిస్తామని, అలాగే ప్రతి రోజూ వెయ్యి మందికి, వారాంతంలో రెండు వేల మందికి దర్శనానికి అనుమతిస్తామని నిబంధన విధించిన నేపథ్యంలో భక్తులు భారీగా తగ్గారు.
మండలం- మకరవిళక్కు పూజల కోసం శబరిమలకి వెళ్ళిన భక్తులు మొదటి వారంలో కేవలం 9,000 మంది మాత్రమేనని కేరళ రాష్ట్ర స్థానిక మీడియా పేర్కొంటుంది. గత ఏడాది మొదటి వారంలో వచ్చిన భక్తులు సుమారు 300,000 మంది కాగా, ఈ ఏడాది కేవలం తొమ్మిది వేల మంది మాత్రమే శబరిమలకి వెళ్లడం గమనార్హం.
ఆన్లైన్ ద్వారా దర్శనం స్లాట్ బుక్ చేసుకునే యాత్రికులు కూడా సుమారు 40 శాతం మంది శబరిమల యాత్ర చేపట్టలేదని సమాచారం.

చాలామంది యాత్రికులు వివిధ రకాల కరోనా నిబంధనల కారణంగా, ఇబ్బందుల కారణంగా శబరి యాత్ర ను క్యాన్సిల్ చేసుకున్నారు. యాత్రికుల సంఖ్య భారీగా తగ్గిపోవడం కారణంగా ట్రావెన్కోర్ బోర్డు ఆదాయం కూడా దారుణంగా తగ్గింది. మొదటి వారంలో హుండీ లో వేసే కానుకల ద్వారా వచ్చిన ఆదాయం ఒక మిలియన్ మాత్రమే. అయితే ఇది ఇతర సాధారణ సంవత్సరాలలో మొదటి వారంలో 35 మిలియన్లుగా ఉందని సమాచారం.యాత్రికుల సంఖ్య భారీగా పడిపోవడం కారణంగా కొట్టాయం మరియు పతనమిట్ట జిల్లాల్లోని దుకాణాలు, బసలు, రెస్టారెంట్లు మరియు అనేక ఇతర వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Recommended Video
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications