భారత్ లో కరోనా టెన్షన్; 14,241కు పెరిగిన యాక్టివ్ కేసులు; తాజా పరిస్థితి ఇదే!!
భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన కొనసాగుతోంది. మూడు రోజులుగా రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తీరు దేశంలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది అన్న ఆందోళనకు కారణంగా మారుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 2,451 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదవడంతో, భారతదేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,30,52,425కి పెరిగింది.
దేశంలో 14,241కి పెరిగిన క్రియాశీల కేసులు
అయితే
క్రియాశీల
కేసులు
14,241కి
పెరిగాయని
కేంద్ర
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
శుక్రవారం
పేర్కొంది.
54
తాజా
మరణాలతో
దేశంలో
ఇప్పటివరకు
మొత్తం
మరణాల
సంఖ్య
5,22,116
కు
చేరుకుంది.
మొత్తం
ఇన్ఫెక్షన్లలో
యాక్టివ్
కేసులు
0.03
శాతం
ఉండగా,
జాతీయ
కోవిడ్-19
రికవరీ
రేటు
98.75
శాతంగా
నమోదైందని
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
యాక్టివ్
కోవిడ్-19
కేసులలో
24
గంటల
వ్యవధిలో
808
కేసుల
పెరుగుదల
నమోదైంది.
రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
గురువారం
నాడు
4.48
లక్షల
మందికి
కరోనా
నిర్ధారణ
పరీక్షలు
చేయగా
2451
మందికి
పాజిటివ్
నిర్ధారణ
అయింది.
పెరుగుతున్న
కరోనా
కేసుల
కారణంగా
రికవరీల
కంటే
కొత్త
కేసులు
ఎక్కువగా
నమోదు
అవుతుండడం
ఆందోళన
కలిగిస్తుంది.
నిన్న
కరోనా
మహమ్మారి
బారినుండి
1589
మంది
కోలుకున్నారు.
ఇక
క్రియాశీల
కేసులు
14,241
కేసులకు
పెరిగాయి.
ఇక
దేశంలోకేసుల
పెరుగుదలకు
ఓమిక్రాన్
వేరియంట్
కారణంగా
కనిపిస్తుంది.
ఇదిలా
ఉంటే
గత
24
గంటల్లో
మృతిచెందిన
54
మందిలో
కేరళ
ప్రకటించిన
మృతుల
సంఖ్య
48
గా
ఉంది.
ఢిల్లీలో కరోనా కేసుల పంజా
దేశ రాజధాని ఢిల్లీ లో నిన్న 965 కేసులు నమోదు కాగా, కేరళ, హర్యానా రాష్ట్రాలలో 300 మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఒకరోజు 18 లక్షల మందికిపైగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకో గా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 187 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని అధికారిక డేటా చెబుతోంది. పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందుతున్న ఢిల్లీలో అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాలలో 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హులైన లబ్ధిదారులందరికీ బూస్టర్ కోవిడ్ -19 డోస్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇక అందరూ మాస్కులు ధరించటం తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తుంది.