Coronavirus: యూపీ సీఎం కీలక నిర్ణయం, వారాంతాల్లో అన్నీ బంద్

లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, పరిశ్రమలు మినహా శని, ఆదివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కే అవస్తి ఆదివారం ప్రకటించారు.

అత్యవసర సరుకుల రవాణా, పరిశ్రమల్లో ఉత్పత్తి వంటి ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అవాంతరాలు ఉండవని స్పష్టం చేశారు. అలాగే వారాంతాల్లో సామాజిక కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
ఆ సమయంలో శానిటైజేషన్ వంటి పారిశుద్ధ్య పనులు జరుగుతాయన్నారు.

Coronavirus: Yogi issues fresh Unlock guidelines; markets in UP to be shut during weekends

ప్రభుత్వ తాజా నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 55 గంటల మినీ లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది జులై 13తో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 35,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,490 యాక్టివ్ కేసులున్నాయి. 22,689 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 913 మంది కరోనా బారిన పడి మరణించారు.

Recommended Video

    RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu

    ఇక దేశంలో ఇప్పటి వరకు 8,56,062 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,91,691 యాక్టివ్ కేసులున్నాయి. 5,41,227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,762 మంది కరోనాతో మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+