ఆ 548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా- కేంద్రం నివేదికలో వెల్లడి....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, వార్డు బాయ్స్ కు కూడా ఈ మహమ్మారి భారీగా సోకినట్లు కేంద్రానికి అందిన తాజా నివేదికలు వెల్లడించాయి. ఇందులో క్షేత్రస్దాయిలో పనిచేస్తున్న వారితో పాటు వార్డ్ బాయ్ లు, ఇతరులను మినహాయించగా... 548 మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఇప్పటివరకూ వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
ఇప్పటివరకూ కరోనా బారిన పడిన డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి వైరస్ ఎవరి నుంచి సోకిందన్నదీ వెల్లడి కాలేదని కేంద్రం నివేదిక పేర్కొంది. వీరిలో కొందరికి పనిచేస్తున్న ఆస్పత్రుల్లో, మరికొందరికి ఇళ్ల వద్ద సమూహాల నుంచి కూడా వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.

అలాగే వీరంతా వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారే అని తేలింది. ఒక్క ఢిల్లీలోనే 69 మంది డాక్టర్లకి కరోనా సోకినట్లు తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం కరోనా బారిన పడిన 548 మందిలో 274 మంది నర్సులే ఉన్నట్లు తేలింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications