కెసిఆర్ ఫ్యామిలీకి సోనియా దీవెన: డిగ్గీతో రాజకీయాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను సోనియాను కలిసి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి సోనియా గాంధీయే ప్రధాన కారణం అన్నారు.కుటుంబ సభ్యులతో కలిసి తాను సోనియాకు ధన్యవాదాలు తెలిపామన్నారు. ఆమె కూడా తమకు దీవెన ఇచ్చారన్నారు.
తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలవాల్సి ఉందన్నారు. రాజకీయ పరమైన అంశాలను తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణకు సంబంధించి ఇంకా కొన్ని అంశాలను ఆమె దృష్టికి తీసుకు వెళ్తే ఆమె హామీ ఇచ్చారన్నారు. తాను రాజకీయ పరమైన అంశాలు మాట్లాడలేదన్నారు.
సోనియాను కలిసిన వారిలో కెసిఆర్, ఆయన సతీమణి, కల్వకుంట్ల తారక రామారావు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే హరీష్ రావు కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త ఉన్నారు. సోనియాతో కెసిఆర్ పది నిమిషాలు మాట్లాడారు.
కెసిఆర్ 1
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
కెసిఆర్ 2
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...
కెసిఆర్ 3
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. కారులోంచి దిగి సోనియా ఇంట్లోకి వెళ్తూ...
కెసిఆర్ 4
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాను కలిసిన అనంతరం కారెక్కుతూ...
కెసిఆర్ 5
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
కెసిఆర్ 6
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. కలిసిన వారిలో కెసిఆర్ ఫ్యామిలీ, కెటిఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు ఫ్యామిలీ, కవిత ఫ్యామిలీ ఉంది.