ఓటు: దుబాయ్ నుండి వచ్చిన పుజారా, క్యూలో బాబు
హైదరాబాద్/జైపూర్: ప్రముఖ క్రికెటర్ ఛటేశ్వర పుజారా దుబాయ్ నుండి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఐపిఎల్ ఆడుతున్న పుజారా ఓటు వేసేందుకే భారత్ వచ్చారు. గుజరాత్లోని రాజ్కోట్లో బుధవారం పుజారా ఓటు వేసి, వెంటనే దుబాయ్కు వెళ్లిపోతారు.
పార్లమెంటరీ ఎన్నికల్లో పుజారాను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం వినియోగించుకుంది. అయితే, ఓటు వేసేందుకు దుబాయ్ నుంచి పుజారా రావడం ఇతర ఓటర్లకు స్పూర్తినిస్తుందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

క్యూలైన్లో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటు వేసేందుకు హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్లోని గాయత్రిహిల్స్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డారు. ఆయనతో పాటు భార్య నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మిణిలు నిలబడ్డారు.
అభినందించాలి: రాజశేఖర్
సినీ నటుడు రాజశేఖర్, అతని భార్య జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజశేఖర్ మాట్లాడుతూ... ఓటు వేసిన వారిని అభినందించాలన్నారు. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని, విద్యావంతులే ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాకులు వెతుకుతున్నారన్నారు. అది మంచిపద్దతి కాదన్నారు. ఓటు వేసి తమ బాధ్యత నిర్వర్తించాలన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications