ముక్కు ద్వారా బూస్టర్ డోస్: భారత్ బయోటెక్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: ట్రయల్స్తో
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వేర్వేరు రూపాల్లో విరుచుకుపడుతోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. కరోనా వైరస్ బలహీనపడుతోందనుకున్న ప్రతీ సందర్భంలోనూ దాని కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. ఇదివరకు డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భయాందోళనలకు గురి చేశాయి. దాన్ని తీవ్ర తగ్గిందనుకునే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తిలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
భారత్లోనూ దీని తీవ్రత కొనసాగుతోంది. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,51,209 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 627 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. 3,47,443 మంది కోలుకున్నారు. దీనితో దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,06,22,709కి చేరింది. యాక్టివ్ కేసులు 21,05,611గా రికార్డయ్యాయి. 4,92,327 మంది ఇప్పటిదాకా మరణించారు.

మహమ్మారిని నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటిదాకా 1,64,44,73,216 డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒమిక్రాన్ తోడైన తరువాత దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్కు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ముక్కు ద్వారా (ఇంట్రానాసిల్) బూస్టర్ డోసులను ఇవ్వడానికి అవసరమైన అనుమతులను తాజాగా పొందింది భారత్ బయోటెక్ మేనేజ్మెంట్. ఈ మేరకు ఈ కంపెనీ యాజమాన్యం దాఖలు చేసుకున్న ప్రతిపాదనలపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ కొద్దిసేపటి కిందటే ఆమోదముద్ర వేసింది. దీనితో- దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తొమ్మిది ప్రాంతాల్లో ఇంట్రానాసిల్ బూస్టర్ డోసులను ఇవ్వడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్ను చేపట్టనుంది భారత్ బయోటెక్.
Recommended Video
ఒక్కో ప్రదేశంలో వంద మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది. మొత్తంగా 900 మందిపై ఈ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని డీసీజీఐ భారత్ బయోటెక్ యాజమాన్యానికి సూచించింది. ఇవి ముగిసిన వెంటనే బూస్టర్ డోసులను అందుబాటులోకి తీసుకొస్తుందీ ఫార్మా కంపెనీ. భారత్ బయోటెక్ అందజేసిన ప్రతిపాదనలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఇచ్చిన సిఫారసుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications