Delhi Blast:పేలుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..?
Delhi car blast:సోమవారం సాయంత్రం ఢిల్లీ నగరంతో పాటు దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో ఉంచిన శక్తివంతమైన బాంబు పేలడంతో ఆ ప్రాంతమంతా చెల్లా చెదురుగా కనిపించింది. ఈ పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరిని చికిత్స కోసం సమీపంలోని లోక్నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ పేలుడును ప్రత్యక్షంగా చూసిన పలువురు ఈ ఘటన గురించి వివరించారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఆ ప్రాంతమంతా భయాందోళనలను రేకెత్తించింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలోని ఐదు నుండి ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి రోడ్డుపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇంకా చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈ పేలుడు సంభవించింది.పేలుడు చాలా శక్తివంతంగా ఉందని, భవనాల కిటికీలు కూడా తెరిచి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "నేను నా దుకాణంలో కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా అంత పెద్ద పేలుడు సంభవించి నా కుర్చీలోంచి పడిపోయాను. నా జీవితంలో ఇంత శక్తివంతమైన పేలుడు శబ్దం నేను ఎప్పుడూ వినలేదు" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
చేయి తెగి పడిపోయింది..
మరో ప్రత్యక్ష సాక్షి రాజ్ధర్ పాండే మాట్లాడుతూ, తాను ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని చెప్పారు. దీంతో తాను టెర్రస్పైకి వెళ్లి చూడగా ఆకాశానికి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసినట్లు వెల్లడించాడు. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అంతటా గందరగోళం నెలకొందని తెలిపాడు. సంఘటన స్థలంలో ఉన్న మరో స్థానిక నివాసి మాట్లాడారు. పేలుడు సంభవించిన తర్వాత తాము అక్కడికి చేరుకున్నప్పుడురోడ్డుపై ఒకరి చేయి పడి ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాము పూర్తిగా షాక్లో ఉండిపోయినట్లు చెప్పిన స్థానికులు ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉందని పేర్కొన్నారు. సమీపంలోని అనేక కార్లు దెబ్బతిన్నాయని,శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు చెప్పారు. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదని వివరించారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro station | A team of Delhi Police Crime Branch arrives at the spot. pic.twitter.com/FpCj1FHqow
— ANI (@ANI) November 10, 2025
ఇదిలా ఉంటే ఈ పేలుడు ఎకో వ్యాన్లో సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇంకా నిర్థారించలేదు.పేలుడు ధాటికి గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక దళాలు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications